నేడు కర్నూలుకు సీపీఐ రామకృష్ణ రాక

ABN , First Publish Date - 2020-08-07T13:32:51+05:30 IST

నేడు కర్నూలుకు సీపీఐ రామకృష్ణ రాక

నేడు కర్నూలుకు సీపీఐ రామకృష్ణ రాక

కర్నూలు: పల్లెబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పత్తికొండకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వస్తున్నట్లు మండల కార్యదర్శి రాజాసాహెబ్‌, పట్టణ కార్యదర్శి సురేంద్రకుమార్‌ తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సీపీఐ పల్లెబాటలో పాల్గొనేందుకు  రామకృష్ణ శుక్రవారం సాయంత్రం 4గంటలకు పత్తికొండ మండలం దూదేకొండ గ్రామానికి వస్తున్నట్లు పేర్కొన్నారు. విజృంభిస్తున్న కరోనా వైరస్‌ పట్ల నివారణ, నియంత్రణ అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య పాల్గొంటారన్నారు. 


దేవనకొండ: పల్లెబాటలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం దేవనకొండకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వస్తున్నట్లు సీపీఐ నాయకులు తెలిపారు. వీరితో పాటు ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గిడ్డయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.మద్దిలేటిశెట్టి హాజరవుతున్నట్లు సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి ఎం.నరసారావు తెలిపారు. 


Updated Date - 2020-08-07T13:32:51+05:30 IST