కర్నూలులో దారుణం... ఆస్పత్రి బయట వర్షంలో కరోనా వృద్ధురాలు

ABN , First Publish Date - 2020-08-10T03:53:22+05:30 IST

నగరంలోని స్టేట్ కోవిడ్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. కరోనా పాజిటివ్ వచ్చిన వృద్ధురాలిని..

కర్నూలులో దారుణం... ఆస్పత్రి బయట వర్షంలో కరోనా వృద్ధురాలు

కర్నూలు: నగరంలోని స్టేట్ కోవిడ్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. కరోనా పాజిటివ్ వచ్చిన వృద్ధురాలిని అంబులెన్స్ సిబ్బంది ఆసుపత్రి బయట వర్షంలో వదిలి వెళ్లిపోయారు. గోసపాడు మండలం నెహ్రూనగర్‌కు చెందిన కొండమ్మ అనే 75 ఏళ్ల వృద్ధురాలికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆమెను బంధువులు అంబులెన్స్‌లో కర్నూలు స్టేట్ కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. అయితే వృద్ధురాలని ఆస్పత్రిలో అడ్మిషన్ చేయకుండా నేలపైనే ఉంచారు. సమాచారం అందుకున్న బంధువులు ఆస్పత్రికి చేరుకుని వర్షంలో  నేలపై అనాథలా పడివున్న కొండమ్మను సుశ్రుత భవన్‌లో ఓ బెడ్‌పై పడుకోబెట్టారు. ప్రస్తుతం వృద్ధురాలికి ట్రీట్ మెంట్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-08-10T03:53:22+05:30 IST