కర్నూల్లోని విద్యాసంస్థల్లో పెరుగుతున్న కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-04-17T16:17:01+05:30 IST
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. తాజాగా ఏపీలోనూ కరోనా తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది...
కర్నూలు: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. తాజాగా ఏపీలోనూ కరోనా తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. విద్యా సంస్థల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కరోనా స్కూళ్లలో 107 కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు విద్యాసంస్థల్లో 827కు కరోనా కేసులు చేరుకున్నాయి. గిరిజన సంక్షేమ హాస్టల్లో ఒకే రోజు 20 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.