-
-
Home » Andhra Pradesh » kurnool betancherla tdp leaders high court andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
బేతంచర్ల టీడీపీ నేతలకు హైకోర్టులో ఊరట
ABN , First Publish Date - 2022-05-05T19:36:24+05:30 IST
కర్నూలు జిల్లా బేతంచర్ల టీడీపీ నేతలకు హైకోర్టులో ఊరట లభించింది.
అమరావతి: కర్నూలు జిల్లా బేతంచర్ల టీడీపీ నేతలకు హైకోర్టులో ఊరట లభించింది. బేతంచర్లలోని సంజీవయ్యనగర్లో నీరు రావడం లేదని కౌన్సిలర్ల ఆధ్వర్యంలో కమిషనర్ను కలిసేందుకు నేతలు వెళ్లారు. అయితే... తనను కులం పేరుతో దూషించారని టీడీపీ నేతలపై కమిషనర్ ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఫిర్యాదుపై టీడీపీ నేతలు ఏడుగురిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసుల ప్రయత్నించారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టివేయాలని హైకోర్టులో సవాల్ చేశారు. టీడీపీ నేతల తరపున న్యాయవాది కృష్ణారెడ్డి వాదించారు. ఈ క్రమంలో కేసులో తదనంతర చర్యలు నిలిపివేయాలని హైకోర్టు స్టే ఇచ్చింది.