కర్నూలులో క్షుద్రపూజల కలకలం
ABN , First Publish Date - 2021-10-05T15:21:41+05:30 IST
జిల్లాలోని పత్తికొండ మండలం పందికోన ఫారెస్ట్లో క్షుద్రపూజల కలకలం రేగింది.
కర్నూలు: జిల్లాలోని పత్తికొండ మండలం పందికోన ఫారెస్ట్లో క్షుద్రపూజల కలకలం రేగింది. మట్టితో తయారు చేసిన బొమ్మలు, కోడిగుడ్లతో భారీ ఎత్తున క్షుద్రపూజలు నిర్వహించారు. క్షుద్రపూజలు చేసిన ప్రదేశాన్ని చూసిన గొర్రెల కాపరులు అటువైపు వెళ్లాలంటే భయపెడుతున్నారు. ఫారెస్ట్లో క్షుద్రపూజలపై ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.