AP: ఎల్లెల్సీ కాల్వలో ముగ్గురు యువకుల గల్లంతు
ABN , First Publish Date - 2021-10-05T13:37:57+05:30 IST
జిల్లాలోని ఆదోని మండలం పెద్ద తుంబలం ఎల్లెల్సీ కాల్వలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.
కర్నూలు: జిల్లాలోని ఆదోని మండలం పెద్ద తుంబలం ఎల్లెల్సీ కాల్వలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. విషయం తెలిసిన అధికారులు మత్స్యకారుల సాయంతో యువకుల కోసం గాలింపు చేపట్టగా ఇప్పటి వరకు రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి కోసం గాలిస్తున్నారు. మృతులు రాజస్థాన్కు చెందిన సునీల్ (18), భవానీ (19), వినోద్ (28)లుగా గుర్తించారు.