కర్నూలులో దారుణం

ABN , First Publish Date - 2021-10-04T17:09:25+05:30 IST

జిల్లాలోని బండి ఆత్మకూరు మండలంలోని పరమటూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.

కర్నూలులో దారుణం

కర్నూలు: జిల్లాలోని బండి ఆత్మకూరు మండలంలోని పరమటూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వెంకట రమణ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ విషయంపై  బండి ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీంతో వెంకటరమణ బంధువులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ నిన్న ఆకస్మికంగా బండి ఆత్మకూరు పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఎస్పీ ఆదేశాలతో బండి ఆత్మకూరు పోలీసులు అప్పటికప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా తీవ్ర గాయాలపాలైన వెంకట రమణ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందాడు. 

Updated Date - 2021-10-04T17:09:25+05:30 IST