అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని వదిలేసిన పోలీసులు
ABN , First Publish Date - 2022-06-29T17:03:27+05:30 IST
జిల్లాలోని కోసిగి మండలం కందుకూరులో తుంగభద్ర నది నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని వదిలేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కర్నూలు: జిల్లాలోని కోసిగి మండలం కందుకూరులో తుంగభద్ర నది నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని వదిలేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక ట్రాక్టర్లపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. 8 మంది డ్రైవర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు... 8 ట్రాక్టర్లు సీజ్ చేసి తహసీల్దార్కు అప్పగించినట్లు ఎస్ఐ రాజారెడ్డి మీడియాకు తెలిపారు. అయితే ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్నది తెలియదని, ట్రాక్టర్లను అప్పగించలేదని తహశీల్ధార్ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో నేతల ప్రమేయంతో గుట్టుచప్పుడు కాకుండా అక్రమ ఇసుక ట్రాక్టర్లను పోలీసులు వదిలేసారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.