Kurnool: వైసీపీలో భగ్గుమన్న వర్గపోరు

ABN , First Publish Date - 2022-06-15T16:32:11+05:30 IST

జిల్లా వైసీపీలో వర్గపోరు భగ్గుమంది. జిల్లాలోని గార్గేపురంలో ఎమ్మెల్యే సుధాకర్,ఇంచార్జ్ కోట్ల హర్ష వర్గాల మధ్య గతరాత్రి ఘర్షణ చోటు చేసుకుంది.

Kurnool: వైసీపీలో భగ్గుమన్న వర్గపోరు

కర్నూలు: జిల్లా వైసీపీలో వర్గపోరు భగ్గుమంది. జిల్లాలోని గార్గేపురంలో ఎమ్మెల్యే సుధాకర్, ఇంచార్జ్ కోట్ల హర్ష వర్గాల మధ్య గతరాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. గార్గేపురంలో గత కొంతకాలంగా ఎస్సీలు, అగ్రవర్ణాల మధ్య ఆధిపత్య గొడవలు నడుస్తున్నాయి. ఊర్లో ఓ ఫంక్షన్ విషయంలో వైసీపీ వర్గం ప్రశాంత్ కుటుంబంపై వినయ్ రెడ్డి వర్గం చేయి చేసుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సీలు... రాత్రి వినయ్ రెడ్డి ఇంటిపై రాళ్లు కర్రలు, రాడ్లతో దాడి చేశారు. దాడిలో కారు, ట్రాక్టర్, ఇంటి సామగ్రి ధ్వంస అవగా... పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని రెండు వర్గాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 


Updated Date - 2022-06-15T16:32:11+05:30 IST