కర్నూలులో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-04-27T16:25:08+05:30 IST
జిల్లాలోని పత్తికొండ మండలం పెద్దహుల్తీ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కర్నూలు: జిల్లాలోని పత్తికొండ మండలం పెద్దహుల్తీ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీసీ రోడ్డు వేసేందుకు వైసీపీ సర్పంచ్ భర్త ప్రయత్నించాడు. దాన్ని స్థానికులు, టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన సర్పంచ్ భర్త అనుచరులు... ఇద్దరు టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో పెద్దహుల్తీ గ్రామాంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.