ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-11-05T22:33:23+05:30 IST

జిల్లాలోని ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. యార్డులో తూకందారులు, హమాలీల మధ్య వివాదం చోటుచేసుకుంది. తూకందారులు, హమాలీలు మోసం చేస్తున్నారని రైతుల ఆందోళనకు దిగారు.

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఉద్రిక్తత

కర్నూలు: జిల్లాలోని ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. యార్డులో తూకందారులు, హమాలీల మధ్య వివాదం చోటుచేసుకుంది. తూకందారులు, హమాలీలు మోసం చేస్తున్నారని రైతుల ఆందోళనకు దిగారు. తూకం విషయంలో తమ ప్రమేయం లేదని హమాలీలు అంటున్నారు. తూకంలో మోసాలకు తూకందారులే కారణమని హమాలీలు చెబుతున్నారు. హమాలీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసులు ఎత్తివేయాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

Updated Date - 2021-11-05T22:33:23+05:30 IST