కర్నూలులో విషాదం

ABN , First Publish Date - 2021-06-11T14:22:10+05:30 IST

జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరులో విషాదచోటు చేసుకుంది. కొవిడ్ మహమ్మారి ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.

కర్నూలులో విషాదం

కర్నూలు: జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరులో విషాదం చోటు చేసుకుంది. కొవిడ్ మహమ్మారి ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కొవిడ్‌తో తల్లి రజితమ్మ మృతి చెందింది. అప్పుల బాధతో తండ్రి బయన్న(38) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఇధ్దరిలో ఒకరు కొవిడ్‌తో, మరొకరు ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు చిన్నారులు అనాధలయ్యారు. చిన్నారుల పరిస్థితి చూసి బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. 

Updated Date - 2021-06-11T14:22:10+05:30 IST