కర్నూలు జిల్లా...బాచుపల్లిలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-04-08T16:54:01+05:30 IST
కర్నూలు జిల్లా...బాచుపల్లిలో ఉద్రిక్తత
కర్నూలు: జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం బాచుపల్లిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైసీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ కాలనీల్లో యువకుల ప్రచారం నిర్వహించారు. ప్రచారం చేస్తున్న యువకులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య పరస్పరం వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న టీడీపీ నేత అఖిలప్రియ ఘటనాస్థలికి బయల్దేరగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని భూమా అఖిలప్రియ ఆరోపించించారు.