కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-11-15T18:24:15+05:30 IST

కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని టీడీపీ నేతలు పట్టుకుని దేహశుద్ది చేశారు.

కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత

చిత్తూరు: కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని టీడీపీ నేతలు పట్టుకుని దేహశుద్ది చేశారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని పట్టుకెళ్ళి వదిలేస్తున్నారని టీడీపీ నేతలు వాదించారు. దీంతో టీడీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కుప్పం ప్లై ఓవర్ వద్ద పోలీసులు.. టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో కుప్పంలో ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసు బలగాలు మోహరించారు. పోలీసుల తీరును తప్పుబడుతూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. 

Updated Date - 2021-11-15T18:24:15+05:30 IST