కుప్పానికి లోకేశ్.. రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం

ABN , First Publish Date - 2021-11-11T02:21:51+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుప్పంలో పర్యటించనున్నారు. గురు, శుక్రవారం ఆయన కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ...

కుప్పానికి లోకేశ్.. రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుప్పంలో పర్యటించనున్నారు. గురు, శుక్రవారం ఆయన కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. గురువారం ఉదయం 7.30గంటలకు స్థానిక నేతలతో లోకేశ్ సమావేశం కానున్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కుప్పం మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అయితే వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యేగా ఉండటంతో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. 

Updated Date - 2021-11-11T02:21:51+05:30 IST