గడపగడపకు వెళ్లలేని నిస్సహాయ స్థితిలో YCP నేతలు: కూన Ravikumar

ABN , First Publish Date - 2022-05-15T18:11:13+05:30 IST

గడపగడపకు కార్యక్రమం చేపట్టిన వైసీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లలేని నిస్సాహాయ పరిస్థితిలో ఉన్నారని...

గడపగడపకు వెళ్లలేని నిస్సహాయ స్థితిలో YCP నేతలు: కూన Ravikumar

Srikakulam: గడపగడపకు కార్యక్రమం చేపట్టిన వైసీపీ (YCP) నేతలు ప్రజల్లోకి వెళ్లలేని నిస్సాహాయ పరిస్థితిలో ఉన్నారని TDP నేత కూన రవికుమార్ (Kuna Ravikumar) విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కండువాతో జనాల్లోకి వెళ్లాలంటే వణికి పోతున్నారని, ప్రజలకు ఏం చేశారో చెప్పలేక పోతున్నారని అన్నారు. సచివాలయ సిబ్బంది, అధికారులు ఉంటే తప్ప గ్రామాల్లోకి వెల్లలేకపోతున్నారన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పిచ్చోడైపోయారని, నియోజకవర్గంలో ఒక్క పని కూడా చేయలేకపోయారని విమర్శించారు.


రాజకీయాల మీద బెట్టింగ్‌లు కడతామంటున్న సీతారాంని ఏందుకు అరెస్ట్ చేయడం లేదని కూన రవికుమార్ ప్రశ్నించారు. ఉద్యోగాలిస్తానని  డబ్బులు దండుకున్నారని, అందుకే మీకు ఓట్లు వేయాలా..? అని నిలదీశారు. హోదా పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. వైసీపీ నేతలు గడపగడపకు వెళ్తే.. చీవాట్లు తప్ప సత్కారాలు లేవని కూన రవికుమార్ ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-05-15T18:11:13+05:30 IST