కుంభకోణం అన్నాడీఎంకే అభ్యర్థికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2021-04-13T12:41:44+05:30 IST

తంజావూరు జిల్లా కుంభకోణం శాసనసభ నియోజకవర్గం అన్నాడీఎంకే అభ్యర్థి, మూవేందర్‌ మున్నేట్ర కళగం అధ్యక్షుడు శ్రీధర్‌ వాండయ

కుంభకోణం అన్నాడీఎంకే అభ్యర్థికి కరోనా పాజిటివ్

చెన్నై: తంజావూరు జిల్లా కుంభకోణం శాసనసభ నియోజకవర్గం అన్నాడీఎంకే అభ్యర్థి, మూవేందర్‌ మున్నేట్ర కళగం అధ్యక్షుడు శ్రీధర్‌ వాండయర్‌ (65) కరోనా వైరస్‌ తాకిడికి గురయ్యారు. ఎన్నికల సందర్భంగా తీవ్రస్థాయిలో ప్రచా రం చేసిన శ్రీధర్‌ వాండయార్‌ కొద్ది రోజులకు ముద్దు జ్వరం, జలుబుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత శనివారం ఆయన కరోనా ముందస్తు పరీక్షలు చేసుకున్నారు. ఆదివారం రాత్రి ఆ పరీక్షలలో ఆయనకు కరోనా పాజిటివ్‌ లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దీనితో తంజావూరు అరుళానందర్‌నగర్‌లోని తన బామరిది డాక్టర్‌ వి. వరరాజన్‌ నివాసగృహంలో ఆయన ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-04-13T12:41:44+05:30 IST