మండలాల్లో కుమరం భీం వర్ధంతి
ABN , First Publish Date - 2021-10-21T04:58:52+05:30 IST
కాగజ్నగర్ లో బుధవారం కుము రం భీంవర్థంతిని నిర్వ హించారు. స్థానికగిరి జన ఆశ్రమోన్నత పాఠ శాలలో పలు కార్యక్ర మాలు వెర్వేరుగా జరి గాయి.
కాగజ్నగర్, అక్టో బరు 20: కాగజ్నగర్ లో బుధవారం కుము రం భీంవర్థంతిని నిర్వ హించారు. స్థానికగిరి జన ఆశ్రమోన్నత పాఠ శాలలో పలు కార్యక్ర మాలు వెర్వేరుగా జరి గాయి. ఈసందర్భంగా నాయకులు కుమ రం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.జడ్పీవైస్చైర్మన్ కోనేరు కృష్ణారావు మాట్లాడుతూ కుమరంభీం ఆశయాల కోసం అంతా పోరాడాలన్నారు. బీజేపీ సిర్పూరు తాలుకా కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజనుల హక్కు లసాధన కోసం తన ప్రాణాలను పనంగా పెట్టి పోరాడిన మహనీయుడు కుమురం భీం అన్నారు. సమావేశాల్లో తెలంగాణ జాగృతిసంఘం నాయకులు, సభ్యులు, వివిధపార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని సీపీఎం కార్యా లయంలో భీం వర్ధంతిని నిర్వహించారు. ఆదివాసి గిరి జనసంఘం జిల్లాఉపాధ్య క్షుడు కోటశ్రీనివాస్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ముంజం ఆనంద్కుమార్ పాల్గొన్నారు.
చింతలమానేపల్లి: మండలకేంద్రం లో భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీపీ నానయ్య, వెంకయ్య, ఎంపీడీవో సుధాకర్రెడ్డి, నారాయణ పాల్గొన్నారు.
కౌటాల: మండలకేంద్రంలో ఎంపీపీ విశ్వనాథ్, డీసీఎంఎస్ వైస్చైర్మన్ మాంత య్య, ఎంపీడీవో నస్రుల్లా, ఎంపీఓ శ్రీధర్ రాజు, సర్పంచ్లు, వీర్దండిలో సర్పంచ్ మడావిరేణుక భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
బెజ్జూరు: మండలంలోని సలుగు పల్లిలో సర్పంచ్ విమల, ధర్మయ్య, భుజం గ్రావు, విశ్వేశ్వర్రావు భీం చిత్రపటానికి పూలమాలలు వేసినివాళులు అర్పించారు.
రెబ్బెన: మండలంలోని గంగాపూర్ ప్రాథమికపాఠశాలలో ఎంపీటీసీ హరిత, ఎస్ఎంసీ వైస్చైర్మన్ కృష్ణవేణి, ప్రధానోపా ధ్యాయుడు చంద్రకాంత్రావు భీం విగ్రహా నికి పూలమాలవేసి నివాళులర్పించారు.
పెంచికలపేట: మండలంలోని ఎల్లూరు గిరిజనసంక్షేమ ఆశ్రమ పాఠశా లలో భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అశోక్,సకారాం, సుధా కర్, పెంటయ్య, కిష్టయ్య, సురేష్, పోశయ్య, రవి, చిన్నన్న పాల్గొన్నారు.
సిర్పూర్(యూ): మండలంలోని బాం డేయేర్, నేట్నూర్, పాములవాడ, ధనోర, తూమ్రిగూడ, మహాగాంతదితర గ్రామా ల్లో కుమ్రం భీం చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ చౌక్లో జైనూర్మార్కెట్ కమిటీచైర్మన్ ఆత్రం భగ్వంత్రావు, సర్పంచులు ఆర్క హిరాబాయి,మెస్రం భూపతి, పీఏసీఎస్ చైర్మన్ కేంద్రే శివాజీ, వీటీడీఏ చైర్మన్ కుమ్ర భీంరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాయిసెంటర్ సార్మేడి ఆత్రంఆనంద్రావు పాల్గొన్నారు.
వాంకిడి: మండలకేంద్రంలో భీం విగ్ర హానికి జడ్పీటీసీ అజయ్కుమార్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. పీఏసీ ఎస్ చైర్మన్ జాబిరేపెంటు, బంబార సర్పంచు సయ్యద్అయ్యూబ్, వినోద్ పాల్గొన్నారు.