కుమరం భీం మనవడికి ఢిల్లీ ఆహ్వానం

ABN , First Publish Date - 2022-08-12T04:54:51+05:30 IST

కుమరంభీం మనవడు కుమరం సోనెరావుకు ఢిల్లీనుంచి పిలుపు వచ్చింది. దీంతో భీం మనుమడు సోనెరావు గురువారం కాగజ్‌నగర్‌ నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీకి పయనమయ్యాడు.

కుమరం భీం మనవడికి ఢిల్లీ ఆహ్వానం
కుమరం సోనేరావును సన్మానిస్తున్న రైల్వే పోలీసులు

సిర్పూర్‌(యూ)/కాగజ్‌నగర్‌ టౌన్‌, ఆగస్టు 11: కుమరంభీం మనవడు కుమరం సోనెరావుకు ఢిల్లీనుంచి పిలుపు వచ్చింది. దీంతో భీం మనుమడు సోనెరావు గురువారం కాగజ్‌నగర్‌ నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీకి పయనమయ్యాడు. ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌లో  భాగంగా ఆదివాసుల హక్కులకోసం పోరాటం చేసిన ఉద్యమకారుల వంశస్థులను కేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్వినీవైష్ణవ్‌ ఆహ్వానించారు. ఈ మేరకు కాగజ్‌నగర్‌ రైల్వే ప్రోటెక్షణ్‌  పోలీసులు మండలంలోని పెద్దదొబా గ్రామానికి చేరుకుని సోనె రావును రైలులో తీసుకెళ్లారు. ఢిల్లీలో సోనెరావుకు సన్మానం చేస్తారని రైల్వేవర్గాలు తెలిపాయి. రెండు రోజుల అనంతరం భీంమనుమడు సోనెరావు, అల్లూరి సీతారామరాజు వారసులు రాష్ట్రపతితో భేటీ చేస్తారని అధికారులు తెలిపారు. దీనిపై ఆదివాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-08-12T04:54:51+05:30 IST