అసదుద్దీన్కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్
ABN , First Publish Date - 2020-06-07T03:52:49+05:30 IST
నగరంలోని గండిపేట చెరువుకు ఎగువన జన్వాడ గ్రామంలో జీవో 111కు విరుద్ధంగా ఫామ్హౌజ్ నిర్మించారంటూ
హైదరాబాద్ : నగరంలోని గండిపేట చెరువుకు ఎగువన జన్వాడ గ్రామంలో జీవో 111కు విరుద్ధంగా ఫామ్హౌజ్ నిర్మించారంటూ దాఖలైన పిటిషన్లో మంత్రి కేటీఆర్కు జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. శనివారం నాడు ఈ నోటీసులపై ట్విట్టర్ వేదికగా మంత్రి స్పందిస్తూ.. ఒక కాంగ్రెస్ నేత ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ భూమి తనది కానే కాదని ఇదివరకే ఆ విషయంపై స్పష్టత ఇచ్చానని మరోసారి కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే ఈ ట్వీట్పై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు.
కేటీఆర్కే మద్దతు..
తాజాగా.. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ కేటీఆర్కు మద్దతిచ్చారు. ‘మీరు సక్సెస్ ఫుల్ మంత్రి. ప్రతిపక్షాలు విసుగెత్తిస్తూనే ఉంటాయి.. మీకు మేం అండగా ఉన్నాం’ అని అసద్ ట్వీట్ చేశారు. ఇందుకు స్పందించిన కేటీఆర్.. అసదుద్దీన్కు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ ఇద్దరి ట్వీట్ సంభాషణపై పలువురు నెటిజన్లు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు.