టీఆర్ఎస్ కార్యకర్త బిడ్డకు కేటీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్
ABN , First Publish Date - 2021-03-13T21:59:13+05:30 IST
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బిడ్డ పుట్టిన రోజుకు మంత్రి కేటీఆర్
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బిడ్డ పుట్టిన రోజుకు మంత్రి కేటీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్ అందించారు. కరీంనగర్కు చెందిన నవాజ్ హుస్సేన్ టీఆర్ఎస్ పార్టీలో చాలాకాలంగా కార్యకర్తగా పనిచేస్తున్నాడు. పార్టీ కోసం అనేక కార్యక్రమాలు చేశాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. కార్యకర్త నవాజ్ హుస్సేన్కు బిడ్డ ఉంది. బిడ్డ పుట్టినరోజు సందర్భంగా స్వయంగా కేటీఆర్ ఫోన్ చేసి పాపతో మాట్లాడారు. ఈ సంతోషంతో కేటీఆర్కు పాప కృతఙ్ఞతలు చెప్పింది.
తన పుట్టిన రోజున ఏం కావాలి అని పాపను కేటీఆర్ అడిగారు. తెలంగాణ గెలిస్తే చాలని ఆ పాప సమాధానం ఇచ్చింది. ఈ సమాధానంతో కేటీఆర్ చలించిపోయారు. అనంతరం పాపకు కేటీఆర్ గిఫ్ట్ను పంపారు. టీఆర్ఎస్ పార్టీ పట్ల కార్యకర్తలకు, వారి కుటుంబానికి ఉన్న అనుబంధానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.