ఆరేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది?: కేటీఆర్

ABN , First Publish Date - 2020-11-29T22:09:44+05:30 IST

ఆరేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గోషామహల్‌ నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్‌ షో నిర్వహించా

ఆరేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది?: కేటీఆర్

హైదరాబాద్: ఆరేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గోషామహల్‌ నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘హైదరాబాద్‌లో ఎలాంటి గొడవలు, కర్ఫ్యూలు లేవు. హైదరాబాద్‌లో మంచి వాతావరణం ఉంది కాబట్టే.. భారీగా పెట్టుబడులు. హైదరాబాద్‌ను కొందరి హైదరాబాద్‌గా చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ వాళ్లు.. జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.15 లక్షలు ఎంతమందికి వేశారు? వరద సమయంలో రానివారందరూ.. ఇప్పుడు వస్తున్నారు. వరదలు వచ్చినప్పుడు మంత్రులతో కలిసి నగరంలో తిరిగాం. వరద సాయం చేస్తే టీఆర్ఎస్‌కు పేరు వస్తుందని ఆపారు. సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని కిషన్‌రెడ్డి ఒక్క రూపాయి అయినా తెచ్చారా? కేంద్రం మనకిచ్చిన దాని కంటే.. మనమే ఎక్కువ ఇచ్చాం’ అని కేటీఆర్ తెలిపారు.

Updated Date - 2020-11-29T22:09:44+05:30 IST