ఖమ్మం నగరంలో అభివృద్ధి పనులను సమీక్షించిన కేటీఆర్‌

ABN , First Publish Date - 2020-06-05T01:07:46+05:30 IST

ఖమ్మం మున్సిపాలిటీల పరిధలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పురపాలక, ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు గురువారం మాసాబ్‌టాంక్‌లోని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి సమీక్షించారు.

ఖమ్మం నగరంలో అభివృద్ధి పనులను సమీక్షించిన కేటీఆర్‌

హైదరాబాద్‌: ఖమ్మం మున్సిపాలిటీల పరిధలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పురపాలక, ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు గురువారం మాసాబ్‌టాంక్‌లోని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా పలు అంవాలపై చర్చించారు. ఖమ్మం నగరంలో కొనసాగుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నగరాభివృద్ధి కోసం చేపట్టిన చర్యల్ని నివేదిక ద్వారా మంత్రి కేటీఆర్‌కు మంత్రి పువ్డాడ వివరించారు. ఖమ్మం నగరంలో కొనసాగుతున్న మిషన్‌ భగీరధ పనుల వివరాలు చర్చకు వచ్చాయి. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన పనులు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. రాబోతున్న వర్షాకాలంలో సీజనల్‌వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై కూడా ఈసమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌, ఖమ్మం కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌, మున్సిపల్‌కమిషనర్‌ అనురాగ్‌ జయంతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-05T01:07:46+05:30 IST