కేసీఆర్ పట్టువిడవని పోరాటంతో తెలంగాణను సాధించారు: మంత్రి కేటీఆర్
ABN , First Publish Date - 2022-02-17T20:44:48+05:30 IST
హైదరాబాద్: కండ్లకోయలో మంత్రి కేటీఆర్ ఐటీ పార్క్ను శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్: కండ్లకోయలో మంత్రి కేటీఆర్ ఐటీ పార్క్ను శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన తండ్రి కేసీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలి ఎన్నికలో ఓడిపోయారన్నారు. అయితే ఓటమితో నిరుత్సాహపడకుండా రాజకీయాల్లో కొనసాగారన్నారు. పట్టువిడవని పోరాటంతో తెలంగాణను సాధించారని కొనియాడారు. ఒకవేళ కేసీఆర్ రాజకీయాలను వీడి ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించేవాళ్లమా? అని ప్రశ్నించారు.
ఐటీ పార్క్తో కండ్లకోయ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే టాప్-5 కంపెనీలు, క్యాంపస్లు హైదరాబాద్లో ఉన్నాయన్నారు. అతిపెద్దదైన ఎత్తిపోతల పథకాన్ని మూడున్నరేళ్లలోనే నిర్మించామని చెప్పారు. మేడిగడ్డ నుంచి మేడ్చల్ వరకు గోదావరి జలాలు తీసుకోవచ్చామని మంత్రి కేటీఆర్ తెలిపారు.