ప్రతిపక్షాలకు కేటీఆర్ బహిరంగ లేఖ

ABN , First Publish Date - 2021-02-26T00:38:20+05:30 IST

ప్రతిపక్షాలకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. నిజం చెప్పులేసుకునే లోపు అబద్దం ఊరంతా తిరిగొస్తుంది అనే సామెత

ప్రతిపక్షాలకు కేటీఆర్ బహిరంగ లేఖ

హైదరాబాద్: ప్రతిపక్షాలకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. నిజం చెప్పులేసుకునే లోపు అబద్దం ఊరంతా తిరిగొస్తుంది అనే సామెత ప్రతిపక్షాలకు సరిపోతుందని లేఖలో వ్యాఖ్యానించారు. విపక్షాలు అబద్ధాలతో యువతను గందరగోళ పర్చే కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ నిజాలు దాస్తున్నాయన్నారు. 2014 నుంచి వివిధ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాలను ప్రజల ముందుంచానని తెలిపారు. 21,32,899 ఉద్యోగాల భర్తీ చేశామని ఆయన ప్రకటించారు. ప్రైవేట్ రంగంలో 14లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. అనుమానాలు ఉంటే ఆయా శాఖల ద్వారా ధృవీకరించు కోవచ్చని సూచించారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి లాంటి నేత కూడా అసత్యాలు చెప్పడం బాధాకరమని లేఖలో కేటీఆర్‌ తప్పుబట్టారు.

Updated Date - 2021-02-26T00:38:20+05:30 IST