కేటీఆర్ పేరుతో రోడ్డు.. చర్చనీయాంశమైన బోర్డు..!

ABN , First Publish Date - 2020-07-01T00:14:59+05:30 IST

అధికారులు చేశారా..? మరెవరైనా చేశారా? అనేది తెలియదు కానీ.. భాగ్యనగరంలో కొత్తగా నిర్మించిన ఓ రహదారికి మంత్రి కేటీఆర్ పేరునే పెట్టేశారు. రోడ్డు ప్రారంభంలో ‘కేటీఆర్ లేన్’ అంటూ ఓ

కేటీఆర్ పేరుతో రోడ్డు.. చర్చనీయాంశమైన బోర్డు..!

హైదరాబాద్: అధికారులు చేశారా..? మరెవరైనా చేశారా? అనేది తెలియదు కానీ.. భాగ్యనగరంలో కొత్తగా నిర్మించిన ఓ రహదారికి మంత్రి కేటీఆర్ పేరునే పెట్టేశారు. రోడ్డు ప్రారంభంలో ‘కేటీఆర్ లేన్’ అంటూ ఓ సూచన బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాశంమైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాయదుర్గం నుంచి వచ్చే వాహనాల కోసం జూబ్లీహిల్స్ హుడా హైట్స్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌కు వెళ్లేందుకు కొత్త రోడ్డు వేశారు. ఈ రోడ్డును మంత్రి కేటీఆర్ వారం రోజుల క్రితం ప్రారంభించారు. అయితే తాజాగా ఆ రోడ్డు ప్రారంభంలో కేటీఆర్ పేరుతో బోర్డును ఏర్పాటు చేసి ఉంది. సోషల్ మీడియాలో ఈ బోర్డు అంశం వైరల్ అవుతోంది.

Updated Date - 2020-07-01T00:14:59+05:30 IST