కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటనపై కేటీఆర్ ఫైర్
ABN , First Publish Date - 2022-03-06T02:03:12+05:30 IST
కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేమన్న.. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటనపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.
హైదరాబాద్: కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేమన్న.. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటనపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని మండిపడ్డారు. తెలంగాణకు నిరంతరం ద్రోహం చేయడమే బీజేపీ విధానమా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలందరూ తెలంగాణ వ్యతిరేకులేనని ధ్వజమెత్తారు. తెలంగాణ బీజేపీ నేతలకు సవాల్ చేస్తున్నామని, తెలంగాణ వ్యతిరేక విధానాలపై దమ్ముంటే కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల తెలంగాణ బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే.. కోచ్ ఫ్యాక్టరీ కోసం కేంద్రాన్ని నిలదీయాలని కేటీఆర్ చెప్పారు.