50 ఏళ్లు అవకాశం ఇచ్చినా ఏమీ చేయలేదు.. ఇప్పుడేం చేస్తారు?: కేటీఆర్
ABN , First Publish Date - 2022-06-22T19:45:13+05:30 IST
జహీరాబాద్ మున్సిపాలిటీకి రూ. 50 కోట్ల సీఎం కేసీఆర్ మంజూరు చేశారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
సంగారెడ్డి : జహీరాబాద్ మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు సీఎం కేసీఆర్(CM KCR) మంజూరు చేశారని మంత్రి కేటీఆర్(Minister KTR) పేర్కొన్నారు. జహీరాబాద్లోని బాగారెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ఇక్కడ పనిచేసిన గీతారెడ్డి(Geetha Reddy)కి మంత్రి పదవి వచ్చింది కానీ, ఈ ప్రాంత ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) మొన్న తెలంగాణకు వచ్చి కాంగ్రెస్స్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నాడన్నారు. కాంగ్రెస్కు 50 ఏళ్లు అవకాశం ఇచ్చినా ఏం చేయలేదన్నారు. ఇప్పుడు అవకాశం ఇస్తే ఏం చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. 65 ఏళ్ళ నుంచి పలు పార్టీలు చేసిన గబ్బును, దరిద్రాన్ని ఇప్పుడిప్పుడే వదల గొడుతున్నామన్నారు. సాగు నీరు, తాగు నీరు, వైద్యం ఇలాంటి పనులు చేసుకుంటూ మనం పోతుంటే.. కొంతమంది కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.