తెలంగాణకు రానున్న మరో మూడు కంపెనీలు: మంత్రి కేటీఆర్

ABN , First Publish Date - 2021-07-30T22:21:12+05:30 IST

చేనేత కార్మికులను ఓనర్లుగా మార్చే చర్యలు చేపట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

తెలంగాణకు రానున్న మరో మూడు కంపెనీలు: మంత్రి కేటీఆర్

సిరిసిల్ల: చేనేత కార్మికులను ఓనర్లుగా మార్చే చర్యలు చేపట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల అపెరల్ పార్కులో గోకుల్‌దాస్ ఇమేజస్ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో ఆరు నెలల్లో కంపెనీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. త్వరలోనే మరో మూడు కంపెనీలు రాబోతున్నాయని కేటీఆర్ తెలిపారు. చేనేత కార్మికులకు అండగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆత్మహత్యలు నివారించగలిగామని మంత్రి తెలిపారు.

Updated Date - 2021-07-30T22:21:12+05:30 IST