కేటీపీఎస్లో కేబుళ్ల చోరీ
ABN , First Publish Date - 2020-11-25T04:44:20+05:30 IST
కేటీపీఎస్లో కేబుళ్ల చోరీ
పాల్వంచ, నవంబరు 24 : పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) 7వ దశలో చోరీ ఉదంతం మంగళవారం వెలుగు చూసింది. కర్మాగారంలో బీహెచ్ఈఎల్ వద్ద సబ్ కాంట్రాక్ట్ పనులు నిర్వహించిన అవేట్స్ కంపెనీకి చెందిన సుమారు రూ.38లక్షల విలువైన కేబుళ్లు చోరీకి గురైనట్లు యాజమాన్యం గుర్తించింది. కర్మాగారంలో పనులు పూర్తి కావడంతో మిగిలిన సామాగ్రి లెక్కలు చూస్తున్న క్రమంలో ఈ చోరీ వ్యవహారం బట్టబయలైంది. అయితే అవేట్స్ కంపెనీలోని కిందిస్థాయి సిబ్బందే ఈ చోరీకి పాల్పడ్డట్లు తెలుస్తుంది. ఈ విషయమై పాల్వంచ టౌన్ ఎస్ఐ ప్రవీణ్ను వివరణ కోరగా చోరీపై ఫిర్యాదు ఇంకా అందలేదన్నారు.