కేటీఎం 250 అడ్వెంచర్ బైక్
ABN , First Publish Date - 2020-11-21T07:44:47+05:30 IST
బజాజ్ ఆటో గ్రూప్నకు చెందిన ప్రీమియం మోటార్ సైకిళ్ల బ్రాండ్ కేటీఎం.. మార్కెట్లోకి కొత్త బైక్ను విడుదల చేసింది. కేటీఎం 250 అడ్వెంచర్ పేరుతో లాంచ్ చేసిన ఈ బైక్ ఽధరను రూ.2,48,256గా నిర్ణయించింది
ధర రూ.2.48 లక్షలు
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో గ్రూప్నకు చెందిన ప్రీమియం మోటార్ సైకిళ్ల బ్రాండ్ కేటీఎం.. మార్కెట్లోకి కొత్త బైక్ను విడుదల చేసింది. కేటీఎం 250 అడ్వెంచర్ పేరుతో లాంచ్ చేసిన ఈ బైక్ ధరను రూ.2,48,256గా నిర్ణయించింది. ఇది ఢిల్లీ ఎక్స్షోరూం రేటు. దేశవ్యాప్తంగా ఉన్న కేటీఎం షోరూమ్ల ద్వారా ఈ బైక్ బుకింగ్ శుక్రవారం నుంచి ప్రారంభమైందని కంపెనీ వెల్లడించింది. 248 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, సిక్స్ స్పీడ్ గేర్బాక్స్, బాష్ కంపెనీకి చెందిన యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎ్స)తో ఈ వాహనాన్ని డిజైన్ చేశారు.