88 పారిశ్రామిక ప్రాజెక్టులకు సర్కారు ఆమోదం, 10,904 మందికి ఉద్యోగాలు
ABN , First Publish Date - 2022-02-03T02:18:27+05:30 IST
88 పారిశ్రామిక ప్రాజెక్టులకు సర్కారు ఆమోదం, 10,904 మందికి ఉద్యోగాలు
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 88 పారిశ్రామిక ప్రాజెక్టులకు రాష్ట్ర సర్కారు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 10,904 మందికి ఉద్యోగాలు కల్పించే రూ.2,367.99 కోట్ల విలువైన 88 పారిశ్రామిక ప్రాజెక్టులకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి మురుగేష్ ఆర్ నిరాణి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి సింగిల్ విండో క్లియరెన్స్ కమిటీ (ఎస్ఎల్ఎస్డబ్ల్యుసిసి) సమావేశంలో ఈ ప్రాజెక్టులకు అనుమతి లభించింది.