కేఎస్కే మహానంది మొండిబాకీల పద్దు
ABN , First Publish Date - 2022-08-14T09:15:27+05:30 IST
హైదరాబాద్కు చెందిన కేఎస్కే మహానంది పవర్ కంపెనీ లిమిటెడ్కు చెందిన మొండి బాకీ(ఎన్పీఏ) పద్దును ఆదిత్య బిర్లా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(ఏఆర్సీ)కి రూ.1,622..
ఎస్బీఐ నుంచి ఆదిత్య బిర్లా ఏఆర్సీకి..
హైదరాబాద్కు చెందిన కేఎస్కే మహానంది పవర్ కంపెనీ లిమిటెడ్కు చెందిన మొండి బాకీ(ఎన్పీఏ) పద్దును ఆదిత్య బిర్లా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(ఏఆర్సీ)కి రూ.1,622 కోట్లకు విక్రయించినట్లు ఎస్బీఐ ప్రకటించింది. తద్వారా బ్యాంక్కు రావాల్సిన మొత్తం బకాయిలో 42 శాతం వసూలైంది. ఎందుకంటే, ఎస్బీఐకి కేఎస్కే మహానంది పవర్ రూ.3,815 కోట్లు చెల్లించాల్సి ఉంది. కేఎస్కే మహానందిపై ప్రస్తుతం దివాలా పరిష్కార చర్యలు కొనసాగుతున్నాయి.