కేఎస్కే మహానది పవర్
ABN , First Publish Date - 2022-08-20T06:07:18+05:30 IST
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే కేఎ్సకే మహానది పవర్ కంపెనీ మొండి బకాయిల (ఎన్పీఏ) ఖాతా నుంచి భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) బయటపడింది.
మొండి బకాయిలు విక్రయం
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే కేఎ్సకే మహానది పవర్ కంపెనీ మొండి బకాయిల (ఎన్పీఏ) ఖాతా నుంచి భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) బయటపడింది. ఈ కంపెనీ నుంచి అసలు, వడ్డీల రూపంలో రావాల్సిన రూ.3,815.04 కోట్ల ఎన్పీఏ ఖాతాను 58 శాతం డిస్కౌంట్తో రూ.1,622 కోట్లకు విక్రయించింది. ఈ నెల 12న ఆదిత్య బిర్లా ఏఆర్సీ ఈ ఎన్పీఏ ఖాతాను కొనుగోలు చేసింది. చత్తీ్సగఢ్ రాష్ట్రంలో కేఎ్సకే మహానది పవర్ ప్రమోట్ చేసిన ఈ విద్యుత్ ప్రాజెక్టు రెండేళ్ల నుంచి దివాలా పరిష్కార ప్రక్రియలో ఉంది.