15న కేఆర్ఎంబీ సబ్కమిటీ సమావేశం
ABN , First Publish Date - 2021-11-12T01:15:37+05:30 IST
కృష్ణానది పరిధిలోని ప్రాజెక్టులపై చర్చించడానికి ఈ నెల 15న
హైదరాబాద్: కృష్ణానది పరిధిలోని ప్రాజెక్టులపై చర్చించడానికి ఈ నెల 15న కేఆర్ఎంబీ సబ్కమిటీ సమావేశం కానుంది. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చించనున్నారు. ఇప్పటికే ఏపీలోని పలు ప్రాజెక్టులను జలవనరుల శాఖ అధికారులు పరిశీలించారు. తెలంగాణ కృష్ణా బేసిన్లోని పవర్ ప్రాజెక్టులను కూడా బోర్డు పరిధిలోకి ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. పవర్ ప్లాంట్లను బోర్డు పరిధిలోకి ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ నెల 15, 16న తెలంగాణలో కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీ సబ్ కమిటీ సభ్యులు పరిశీలించనున్నారు.