జలసౌధలో ముగిసిన కేఆర్ఎంబీ సమావేశం
ABN , First Publish Date - 2021-12-24T01:44:01+05:30 IST
జలసౌధలో కేఆర్ఎంబీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో
హైదరాబాద్: జలసౌధలో కేఆర్ఎంబీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కృష్ణా నది పరివాహక ప్రాంత రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు. చెన్నైకి తాగునీటి కేటాయింపులపై చర్చించారు. చెన్నైకి 5 టీఎంసీల కేటాయింపునకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సమ్మతి తెలిపాయి. అయితే 10 టీఎంసీల నీటి విడుదలపై మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు స్పష్టత ఇవ్వలేదు. తమిళనాడుకు భారీ వరదలు రావడంతో పెద్దగా నీటి సమస్య తలెత్తలేదు. ఇప్పటికే చెన్నై తాగునీటి కోసం నీటిని తెలంగాణ విడుదల చేసింది. ఇప్పటివరకు ఐదున్నర టీఎంసీలను చెన్నై వాడుకున్నది. చెన్నై నీటి కేటాయింపుల కమిటీలో కర్నాటక, మహారాష్ట్ర ఉండలేమని పేర్కొన్నాయి.