ముగిసిన కేఆర్ఎంబీ, జీఆర్‌ఎంబీ సమావేశం

ABN , First Publish Date - 2021-09-17T22:57:07+05:30 IST

కేఆర్ఎంబీ, జీఆర్‌ఎంబీ సమావేశం ముగిసింది. 10 రోజుల్లోగా ఉద్యోగులు, సిబ్బంది వివరాలను అందించాలని

ముగిసిన కేఆర్ఎంబీ, జీఆర్‌ఎంబీ సమావేశం

హైదరాబాద్: కేఆర్ఎంబీ, జీఆర్‌ఎంబీ సమావేశం ముగిసింది. 10 రోజుల్లోగా ఉద్యోగులు, సిబ్బంది వివరాలను అందించాలని, ఇరు రాష్ట్రాలను కేఆర్‌ఎంబీ సబ్ కమిటీ కోరింది. ఆపరేషన్స్, మేయింటెనెన్స్‌కు సంబంధించిన వివరాలివాలని కమిటీ సూచించింది. సీఐఎస్ఎఫ్ భద్రత అంశాన్ని చివరగా చర్చిద్దామని సబ్ కమిటీ చెప్పింది. బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్‌ను బోర్డు పరిధిలోకి వద్దని ఏపీ తెలిపింది. బోర్డు పరిధిలోనే ఉంచాలని తెలంగాణ అభిప్రాయపడింది. ఈ అంశాలపై పరిశీలిస్తామని కన్వీనర్ పిళ్ళై చెప్పారు. వచ్చే గురువారం మరోసారి బోర్డు మీటింగ్‌ జరిగే అవకాశం ఉంది.

Updated Date - 2021-09-17T22:57:07+05:30 IST