‘రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు అవసరం లేదు’

ABN , First Publish Date - 2020-08-09T01:23:51+05:30 IST

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఎన్జీటీ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. కేఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీ అనుమతులు తప్పని సరి అని పేర్కొంది.

‘రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు అవసరం లేదు’

ఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఎన్జీటీ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. కేఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీ అనుమతులు తప్పని సరి అని పేర్కొంది. అంతవరకు ప్రాజెక్ట్ పనులు చేపట్టరాదన్న ఎన్జీటీ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. కొత్త డీపీఆర్‌ సమర్పించాలని నిపుణుల కమిటీ సూచించింది. ఈ నెల 11న ఎన్జీటీలో మళ్లీ విచారణ జరుగుతుంది.


మరోవైపు ఏపీ, తెలంగాణ సీఎంలకు  కేంద్ర జలవనరుల మంత్రి లేఖలు రాశారు. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు నిర్మించవద్దని ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌ అంశాల పరిష్కారానికి అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో భేటీ త్వరలో జరగాలని కేంద్రమంత్రి చెప్పారు.

Updated Date - 2020-08-09T01:23:51+05:30 IST