నష్టపోయిన అందరికీ పరిహారం ఇవ్వాలి
ABN , First Publish Date - 2020-10-24T10:22:18+05:30 IST
నగరంలోని వరద బాధితుల్లో కేవలం గ్రౌండ్ఫ్లోర్లో ఉంటున్న వారికే నష్టపరిహారం ఇస్తున్నారని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు.
వరద సాయంపై ఆర్. కృష్ణయ్య
దిల్సుఖ్నగర్, అక్టోబర్ 23 (ఆంధ్రజ్యోతి): నగరంలోని వరద బాధితుల్లో కేవలం గ్రౌండ్ఫ్లోర్లో ఉంటున్న వారికే నష్టపరిహారం ఇస్తున్నారని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. మొదటి అంతస్తులో ఉన్న వారి వాహనాలు, ఇతరత్రా పరికరాలు చాలా వరకు వరదనీటికి పాడైనందున వారికి కూడా నష్టపరిహారం ఇవ్వాలన్నారు. హైదరాబాద్లో ఇళ్లు లేని వరద బాధితులందరికీ డబుల్బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలతో వరదలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం చైతన్యపురిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్, మెదక్ తదితర ఉమ్మడి జిల్లాల్లో సుమారు 30 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందన్నారు.