బీసీ సేన రాష్ట్ర కార్యదర్శిగా కృష్ణయాదవ్‌

ABN , First Publish Date - 2020-06-29T11:04:21+05:30 IST

బీసీ సేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బూరుగుపల్లి కృష్ణ యాదవ్‌ను నియమిస్తూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆదివారం

బీసీ సేన రాష్ట్ర కార్యదర్శిగా కృష్ణయాదవ్‌

పాలమూరు, జూన్‌ 28: బీసీ సేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బూరుగుపల్లి కృష్ణ యాదవ్‌ను నియమిస్తూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆదివారం హైదరా బాద్‌లో ఉత్వర్వులు జారీచేశారు. తనపై నమ్మకం ఉంచి జాతీయ బీసీ సేన అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్‌, ఆర్‌.క్రిష్ణయ్య బాధ్యతలు అప్పగించటం సంతోషంగా ఉందన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు సాధించేందుకు పోరాటం చేస్తానన్నారు.  డి.వీరకుమార్‌,  అశోక్‌యాదవ్‌, బాలాస్వామి, శ్రీనివాస్‌యాదవ్‌, మల్లేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-29T11:04:21+05:30 IST