తెప్పపై ఆండాళ్‌ సమేత కృష్ణస్వామి విహారం

ABN , First Publish Date - 2021-02-24T07:42:22+05:30 IST

తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయ తెప్పోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు మంగళవారం సాయంత్రం స్వామివారు ఆండాళ్‌ సమేత కృష్ణస్వామి అలంకరణలో భక్తులకు కనువిందు చేశారు.

తెప్పపై ఆండాళ్‌ సమేత కృష్ణస్వామి విహారం
తెప్పపై విహరిస్తున్న స్వామివారు

తిరుపతి(కల్చరల్‌), ఫిబ్రవరి 23: తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయ తెప్పోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు మంగళవారం సాయంత్రం స్వామివారు ఆండాళ్‌ సమేత కృష్ణస్వామి అలంకరణలో భక్తులకు కనువిందు చేశారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారు పుష్కరిణిలో ఐదు పర్యాయాలు విహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేశ్రేణి డిప్యూటీ ఈవో రాజేంద్రుడు, ఏఈవో రవికుమార్‌ రెడ్డి, సూపరింటెండెంట్లు వెంకటాద్రి, రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు కామరాజు, మునీంద్రబాబు, అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-24T07:42:22+05:30 IST