తిరుపతి(పద్మావతీనగర్), జనవరి 16: తిరుపతి సర్కిల్-2 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా బీవీఎస్ కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ధర్మవరం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా పనిచేస్తున్న కృష్ణారెడ్డి బదిలీపై తిరుపతి సర్కిల్-2 లేబర్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఆదివారం ఆయన బాధ్యతలు చేపట్టాక మీడియాతో మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. అలాగే నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తానని పేర్కొన్నారు.