భూ సేకరణ పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2021-03-03T04:33:31+05:30 IST
భూ సేకరణ పూర్తి చేయాలి
ఇన్చార్జి కలెక్టర్ కృష్ణఆదిత్య
భూపాలపల్లి కలెక్టరేట్, మార్చి 2 : సింగరేణి, జెన్కో సంస్థలకు అవసరమైన భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కృష్ణఆదిత్య రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సింగరేణి, జెన్కో సంస్థలకు అవసరమైన భూసేకరణపై సంబంధిత మండలాల తహసిలార్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేటీకే ఓసీ-3కి ఘణపురం మండలంలో అవసరమైన పెండింగ్లో ఉన్న భూసేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. తాడిచెర్ల నుంచి జెన్కో వరకు బొగ్గు తరలించేందుకు మల్హార్రావు, భూపాలపల్లి మండలాల్లోని భూసేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆర్డీఓ శ్రీనివాస్, తహసిలార్లు ఇక్బాల్, మాధవి, శ్రీనివాస్, జెన్కో అధికారులు పాల్గొన్నారు.