కృష్ణా జలాల వినియోగంపై దృష్టి పెట్టాలి: చాడ
ABN , First Publish Date - 2020-05-31T09:02:39+05:30 IST
ప్రాణహిత దగ్గర తుమ్మిడి హట్టి రిజర్వాయర్, దక్షిణ తెలంగాణకు జీవనాధారమైన కృష్ణా జలాల ఆధారిత పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటూ సీపీఐ...
హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత దగ్గర తుమ్మిడి హట్టి రిజర్వాయర్, దక్షిణ తెలంగాణకు జీవనాధారమైన కృష్ణా జలాల ఆధారిత పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి శనివారం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. ఎత్తిపోతల ద్వారా కొండపోచమ్మకు గోదావరి జలాలు తీసుకురావడం అభినందనీయమన్నారు. ఇక కృష్ణా జలాల వినియోగంపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు.