కృష్ణాజలాలు అందించింది చంద్రబాబే
ABN , First Publish Date - 2020-06-03T10:14:08+05:30 IST
రాయలసీమకు కృష్ణాజలాలు అందించిన ఘనత మాజీ సీఎం చంద్రబాబుదేనని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక
మీడియా సమావేశంలో గోవర్ధనరెడ్డి, హరిప్రసాద్
కడప (నాగరాజుపేట), జూన్ 2: రాయలసీమకు కృష్ణాజలాలు అందించిన ఘనత మాజీ సీఎం చంద్రబాబుదేనని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధనరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ కృష్ణా నీటిపై అఖిలపక్ష కమిటీలు వేయకుండా జీవోలు తేవడం బాధాకరమని, స్వార్థం వీడి రాయలసీమ రైతుల అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఎన్టీఆర్, చంద్రబాబులు ప్రాజెక్టుల విషయంలో చిత్తశుద్ధితో పనిచేశారన్నారు. కరువు ప్రాంతమైన రాయలసీమకు సాగు, తాగునీటిని అందించి రైతులను ఆదుకోవాలన్నారు. సమావేశంలో మత్స్యశాఖ మాజీ డైరెక్టరు రాంప్రసాద్ పాల్గొన్నారు.