Increased flood: కృష్ణా-తుంగభద్ర నదుల్లో పెరిగిన వరద
ABN , First Publish Date - 2022-08-10T17:39:36+05:30 IST
ఎగువ భాగంతో పాటు జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా-తుంగభద్ర(Krishna-Tungabhadra) నదుల్లో వరద ఉధృతి పెరిగింది. ఎగువ
రాయచూరు(బెంగళూరు), ఆగస్టు 9 : ఎగువ భాగంతో పాటు జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా-తుంగభద్ర(Krishna-Tungabhadra) నదుల్లో వరద ఉధృతి పెరిగింది. ఎగువ భాగం నుంచి వస్తున్న వరద కారణంగా తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు 1.40 లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదే సమయంలో నారాయణపూర్ జలాశయం నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో కృష్ణా నది(Krishna river)లో 1.47లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలో రెండు నదుల తీరంలో ఉన్న గ్రామాల ప్రజలకు జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్ని గ్రామాల్లో చాటింపు వేయిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.