కృష్ణా: మల్లవల్లిలో భూగర్భ గనులశాఖ స్పెషల్ స్క్వాడ్ తనిఖీలు

ABN , First Publish Date - 2022-03-12T00:22:00+05:30 IST

జిల్లాలోని బాపులపాడు మండలం మల్లవల్లిలో భూగర్భ గనులశాఖ స్పెషల్

కృష్ణా: మల్లవల్లిలో భూగర్భ గనులశాఖ స్పెషల్ స్క్వాడ్ తనిఖీలు

కృష్ణా: జిల్లాలోని బాపులపాడు మండలం మల్లవల్లిలో భూగర్భ గనులశాఖ స్పెషల్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. అక్రమ గ్రావెల్ తవ్వకాలపై వైసీపీ నేత గోసుల శివభరత్‌రెడ్డి క్షేత్రస్థాయి పర్యటన, విమర్శల నేపథ్యంలో భూగర్భ గనుల శాఖ అధికారులు స్పందించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి వివరాలు అందజేయాలని ఉన్నతాధికారుల ఆదేశంతో జిల్లా అధికారులు తనిఖీలు చేశారు. చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్‌లో  కేసు విచారణలో ఉన్నా నిబంధనలకు వ్యతిరేకంగా గ్రావెల్ తవ్వకాలు జరిపినట్లు నిర్ధారించారు. మండల రెవెన్యూ అధికారుల నుంచి తవ్వకాలకు సంబంధించి భూమి మ్యాప్, సరిహద్దు వివరాలను రికార్డుల రూపంలో స్పెషల్ స్క్వాడ్ అధికారులు తీసుకున్నారు. 

Updated Date - 2022-03-12T00:22:00+05:30 IST