ప్రకాశం బ్యారేజి వద్ద తగ్గిన వరద ఉధృతి
ABN , First Publish Date - 2021-07-27T04:15:20+05:30 IST
ఎగువనున్న ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి విడుదల తగ్గించడంతో ప్రకాశం బ్యారేజి వద్ద వరద ఉధృతి తగ్గింది
దిగువకు 37వేల క్యూసెక్కుల నీరు
తాడేపల్లి టౌన్, జూలై 26: ఎగువనున్న ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి విడుదల తగ్గించడంతో ప్రకాశం బ్యారేజి వద్ద వరద ఉధృతి తగ్గింది. పులిచింతల ప్రాజెక్టు, బ్యారేజి ఎగువనున్న వాగుల నుంచి సోమవారం 37వేల క్యూసెక్కుల వరదనీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతున్నట్టు నీటిపారుదల శాఖ జేఈ దినేష్ తెలిపారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 4300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అలాగే బ్యారేజి రిజర్వాయర్ వద్ద 12 అడుగుల నీటిమట్టం నమోదవుతుండగా 45 గేట్లను ఒక అడుగుమేర ఎత్తి 33వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలచేస్తున్నట్టు తెలిపారు.
సాగర్ నీటి సమాచారం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ నీటిమట్టం సోమవారం నాటికి 538.80 అడుగులు ఉంది. ఇది 185.83 టీఎంసీలకు సమానం. ఎస్ఎల్బీసీద్వారా 1000 క్యూసెక్కులు, మొత్తం ఔట్ఫ్లో 1000క్యూసెక్కుల నీటినివిడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు ఇన్ఫ్లో 25,427 క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 871.30అడుగులుంది. ఇది 147.27 టీఎంసీలకు సమానం. జూరాలనుంచి 3,63,760 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి ఇన్ఫ్లో చేరుతోంది.