4న కృష్ణా రివర్ బోర్డు సమావేశం
ABN , First Publish Date - 2020-06-03T01:03:48+05:30 IST
ఈ నెల 4న కృష్ణా రివర్ బోర్డు సమావేశం కానుంది. దీంతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కృష్ణా రివర్ బోర్డు మీటింగ్ ఏజెండాను
హైదరాబాద్: ఈ నెల 4న కృష్ణా రివర్ బోర్డు సమావేశం కానుంది. దీంతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కృష్ణా రివర్ బోర్డు మీటింగ్ ఎజెండాను పంపించింది. ఎజెండాలో ప్రధానంగా ఐదు అంశాల ప్రస్తావించింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు చేపడుతున్న ప్రాజెక్టులు, అభ్యంతరాలు, డీపీఆర్లు, అలాగే వచ్చే సంవత్సరానికి సంబంధించి నీటి పంపకాలు.. నీటి వినియోగానికి సంబంధించి టెలిమెట్రిక్ ఏర్పాటుపై చర్చించనుంది. వీటితో పాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ కింద విద్యుత్ వినియోగం.. ఇరు రాష్ట్రాల నుంచి బోర్డుకు రావాల్సిన నిధులపై కూడా చర్చించనుంది. అలాగే ఇరు రాష్ట్రాలు సూచించే అంశాలపైనా కూడా కృష్ణాబోర్డులో చర్చ జరగనుంది.