కృష్ణా జిల్లా గూడూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-07-18T01:10:01+05:30 IST

గూడూరు (Gudur) వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళుతూ రోడ్డు పక్కన నడుస్తున్నవ్యక్తులను...

కృష్ణా జిల్లా గూడూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

కృష్ణా (Krishna): గూడూరు (Gudur) వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళుతూ రోడ్డు పక్కన నడుస్తున్నవ్యక్తులను కారు (Car) ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పాదచారులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మునియ్య (Muniah), చెంచమ్మ (Chenchamma)లుగా గుర్తించారు. మద్యం మత్తులో మితి మీరిన వేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు. డ్రైవర్ (Driver)ను అదుపు‎లోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. మద్యం మత్తులో డ్రైవింగ్ (Driving) చేయొద్దని.. రోడ్డు నియమాలను పాటించాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్ (Traffic Rules) అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 


Updated Date - 2022-07-18T01:10:01+05:30 IST